అమరావతి: అమరావతి నగర రూపకల్పనపై ఏపీ సలహాదారు పరకాల ప్రభాకర్ నేతృత్వంలో నిష్ణాతుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఏప్రిల్ చివరి నాటికి తుది ఆకృతులను లండన్ డిజైనర్లు సమర్పిస్తారని పరకాల తెలిపారు. వీటిల్లో మన చరిత్ర, సంప్రదాయాలకు తగినట్లు, భవిష్యత్తు అవసరాలు తీర్చేలా నగరాన్ని నిర్మిస్తామన్నారు. దీనిలో తొమ్మిది నగరాలు ఉంటాయని ఆయన తెలిపారు. వాటి పేర్లు ఏమిటన్నది అందరినీ సంప్రదించి నిర్ణయిస్తామన్నారు.