నెల్లూరు: మెరుగైన పీఆర్సీ సాధనే లక్ష్యంగా పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీగా నెల్లూరు బోసుబొమ్మ ఏబీఎం కాంపౌండ్ నుండి ప్రదర్శన ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఆర్సి సాధన సమితి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పి ఆర్ సి ఉద్యోగులు హక్కులను కాలరాసే విధంగా ఉందని ధ్వజమెత్తారు.
మెరుగైన పిఆర్సి సాధించే వరకూ తమ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. నెల్లూరు బోసుబొమ్మ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన కనక మహాల్, గాంధీ బొమ్మ విఆర్ సి, మద్రాసు బస్టాండు, ఆర్టిసి బస్టాండు, పాత జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్ కు ప్రదర్శన చేరుకుంది.
అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్సీ సాధన సమితి చైర్మన్లు మన్నేపల్లి. పెంచలరావు, రమణారెడ్డి, పెంచలరెడ్డి, సుధాకర్ రావు, ఆంజనేయ వర్మ, పెంచలయ్య, విజయకుమార్, దశరధ రాములు, రామక్రష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.