మసీదు నిర్మాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి బుడ్డా శ్రీకాంత్రెడ్డి వాహనంపై దాడి చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్, అతని అనుచరులను స్టేషన్కు తరలించి రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడారు. బుడ్డా శ్రీకాంత్రెడ్డి, అతడి ఐదుగురు అనుచరులతోపాటు అతడిపై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వాస్తవాలు ఇలా ఉంటే, కేంద్రమంత్రి ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందనడం బాధ్యతా రాహిత్యం అని మేకతోటి సుచరిత తెలిపారు