కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈడేపల్లికి చెందిన జూనపూడి వినోదరావు వైసీపీలో దళిత జేఏసీ జనరల్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని హత్య చేసి నోట్లో గుడ్డలు కుక్కి తన ఇంటి పోట్కోకి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మాసుమ్ బాషా ఘటనాస్థలిని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి.