ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడిలో బంగారు ఆభరణాలు చోరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 12:58 PM

విజయవాడ: సింగ్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో బంగారు ఆభరణాలు చోరికి గురియైనట్లు ధర్మకర్త చింత ధన కోటేశ్వరరావు సింగ్ నగర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆలయ ధర్మ కర్త తెలిపిన వివరాల ప్రకారం అజిత్ సింగ్ నగర్ గంగనమ్మ గుడి వద్ద గల ఆంజనేయ స్వామి వారి గుడిలోని పాత అర్చకుడు మాని వేసినందున ఈనెల 12 వ తేధిన కిరణ్ అనే అర్చకుడ్ని ఆలయ ధర్మకర్త నియమించారు. మరుసటి రోజు సాయంత్రం స్వామి వారికి ఆలకరించమని షుమారు ఏడు గ్రాములు బరువు గల కన్నులను 3 గ్రాముల బరువు గల నామము ఇచ్చామని తెలిపారు. సదరు అర్చకుడు 16వ తేధినుండి మాని వేశారని తెలిపారు. సదరు అర్చకుడైన కిరణ్ కు ఫోన్ చేయగా సెల్ ఫోన్ స్వీచ్ ఆఫ్ అయినట్లు తెలిపారు. గుడి తెరచి చూడగ స్వామి వారి కన్నులు , నిమము చోరికి గురియైనట్లు తెలిపారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com