ఆరోగ్యానికి అమ్మ.. నిమ్మ అని ఆరోగ్య శాస్త్రం చెబుతుంది. కరోనా ఏమని దాపురించిందో నిమ్మ రైతు జీవితం వీధులు పాలయ్యందని రైతులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు డివిజన్ నిమ్మ పంటకు ప్రసిద్ధి. ప్రభుత్వాలు మారిన నిమ్మ రైతులకు కష్టాలు తప్పడం లేదు. గూడూరు నిమ్మ మార్కెట్ అసోసియేషన్ నిమ్మ పంటకు ధరలు పెంచక తక్కువ ధరలను నిర్ణయించి ఒకే రేటుతో కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గిట్టు బాటు ధరలు లేక రైతులు దిగాలు పడుతున్నారు. గూడూరు నిమ్మ మార్కెట్ కు డివిజన్ లోని సైదాపురం, వెంకటగిరి, డక్కిలి గూడూరు, పొదలకూరు, రాపూరు చుట్టుపక్కల గ్రామాల నుండి గూడూరు నిమ్మ యార్డుకు తరలిస్తారు. 10శాతం కమీషన్ తో పాటు, గోతాల రూపంలో రూ. 7 చొప్పున దోచుకుంటున్నారు. రైతు మార్కెట్లో రూ. 32 చొప్పున కొనుగోలు చేసి నిమ్మ మార్కెట్ కు తరలిస్తే ఆ గోతానికి రూ. 25 బిల్లులో ఇస్తారు.
దీంతో రైతుల నుండి వ్యాపారులు గోతానికి రూ.7 చొప్పున దోచుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. అసలే నిమ్మ ధరలు లేక ఒక్కపక్క రైతులు భాదపడుతూ ఉంటే మార్కెట్ లో గోతాల రూపంలో కూడా అసోసియేషన్ రైతులను ఫీక్కు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీ నిమ్మకాయలను అసోసియేషన్ రూ. 5 నుంచి కొనుగోలు చేస్తున్నారు. రైతు ఒక్క డిక్కీ(40)కేజీలు కాయలు కోయించాలంటే ఒక్కరూ లేదా ఇద్దరు కూలీలతో కోయిస్తారు.
ఒక్కొక్క కూలీకి రూ.150 నుంచి రూ. 200 చొప్పున కూలీ ఉంటుంది. డిక్కీ ధర 200, ఆ 200కు 10శాతం కమీషన్ అంటే రూ.4, డిక్కీ గోతాం ధర రూ. 7 డిక్కీ బాడుగ 40 రూపాయలు వెరసి రైతు ఒక డిక్కీ కి 400+4+7+40=447 ఖర్చు అవుతుంది అమ్మగా రైతుకు అమ్మగా వచ్చేది రూ.200 మాత్రమే. రైతు తిరిగి 247లను నష్టపోతున్నారు. నిమ్మ మార్కెట్ యార్డును పర్యవేక్షించి రైతుల ప్రయోజనాలను చూడాల్సిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పర్యవేక్షించే వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలే చూడాలని రైతులు కోరుతున్నారు. నిమ్మ పంట రంగానికి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వమే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాల్సి ఉంది.