జైపూర్ : రాజస్థాన్ జోధ్పూర్లోని ఉమైద్ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం బయటపడింది. గర్భిణికి శస్త్రచికిత్స చేస్తూ.. ఇద్దరు వైద్యులు గొడవపడ్డారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స అనంతరం శిశువు మృతి చెందింది. శిశువు మృతిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్లో గొడవ పడిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.