ఒమిక్రాన్ వేరియంట్ భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో గత నెల గుర్తించిన ఈ వేరియంట్.. చూస్తుండగానే అన్ని దేశాలకూ వ్యాపిస్తోంది.. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం 38 దేశాలకు వ్యాపించింది.అయితే భారత్ లో వేరియంట్ కేసుల సంఖ్య 4 కి చేరింది. శనివారం (డిసెంబర్ 4)న దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన కళ్యాణ్-డోంబివిలీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి #Omicron వేరియంట్కు పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఇదే భారత్ లో 4వ ఓమిక్రాన్ కేసు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.