ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో ఆగని వరుణుడి ప్రభావం.. ఇవాళ ఒక్కరోజే ఐదుగురి మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 06:24 PM

తమిళనాడులో ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు.
 ప్రస్తుతం కొమరిన్ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం (నవంబరు 29) నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో  క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని, పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది.
దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో వర్ష బీభత్సం కారణంగా మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ మంత్రి కేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ వెల్లడించారు. నిన్న ముగ్గురు మరణించగా, నేడు మరో ఐదుగురు భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తమిళనాడులోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com