ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 16,156 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 28, 2021, 10:54 AM

 దేశంలో కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 733 మంది కరోనాతో మృతి చెందగా 17,095 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు చేరింది. ఇందులో 3,36,14,434 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,56,386 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇంకా 1,60,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


దేశంలో కొత్తగా 49,09,254 టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,04,04,99,873 కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com