ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను హత్య చేస్తామంటూ ఢిల్లి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తును ఉత్తర్ ప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్)కు అప్పగించారు. బెదిరింపు ఫోన్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (బిఒఐపి)నుంచి వచ్చిందని, దాని జాడ తెలుసుకోలేకపోయామని, అందుకే ఈ కేసును ఎటిఎస్కు అప్పగించామని అడిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ చెప్పారు. పోలీస్ కంట్రోల్ రూమ్లో విధుల్లో ఉన్న అధికారి ల్యాండ్ లైన్కు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన ఆగంతకుడు యోగి ఆదిత్యనాథ్ను రక్షించుకోవడానికి మీకు కేవలం గంట సమయం మాత్రమే ఉందని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడని ఒక పోలీస్ ఉన్నతాధికా చెప్పారు. కాగా ఇది ఆకతాయిలు చేసిన బెదిరింపు ఫోన్గా వెల్లడైనట్లు సమాచారం.