ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితమే ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 35 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 నవంబర్ 11 చివరి తేదీ. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వార అనేక ఖాళీలను భర్తీ చేస్తోంది ఏపీపీఎస్సీ. ప్రస్తుతం 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు, 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తాజాగా 35 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టింది.