ముంబై: శునకాలు అలా రంగు మారడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. తలోజా పారిశ్రామికవాడ నుంచి వస్తున్న వ్యర్థాల వల్లే కుక్కలు రంగు మారుతున్నట్లు అనుమానించారు. అయితే దీనిపై ఆరా తీస్తున్న అధికారులు కుక్కలు బ్లూ రంగులోకి మారడానికి గల కారణాలను గుర్తించారు. పారిశ్రామిక వాడలో ఉన్న ఓ డై కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల కుక్కలు నీలి రంగులోకి మారుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రానికి చెందిన కాలుష్య నియంత్రణ బోర్డు ఈ అంశాన్ని లైట్గా తీసుకుంటున్నదని ఆ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కుక్కలే కాదు, వ్యర్థాలను తీసుకుంటున్న పక్షులు కూడా రంగు మారుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.కుక్కలు నీలి రంగులోకి మారుతున్న ఘటన ఇటీవల ముంబైలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.