ప్రియుడిపై మోజులో తల్లి, తండ్రి ఉద్యోగం కోసం ఓ కొడుకు కలిసి వేసిన దారుణమైన ప్లాన్.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల భీమ్ రావ్ కార్టే నాలుగు నెలల క్రితం చనిపోయాడు. బావిలో పడి చనిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంసభ్యులు నమ్మించారు. అయితే ఆయన సన్నిహితులు కొందరు ఆయనది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకోలేదు. అయితే దీనిపై వాళ్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. ఈ పరిణామం చోటు చేసుకోవడంతో మృతి భార్య, ఆమె ప్రియుడు, వారి కుమారుడు పరారయ్యారు. భర్త చనిపోతే తనకు ఆయనకు పీఎఫ్ డబ్బులు రావడంతో పాటు ప్రియుడితో కలిసి ఉండేందుకు అడ్డు ఉండదని భార్య ప్లాన్ చేసింది. ఇక తండ్రి సర్వీసులో ఉండగా చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని కుమారుడు అనుకున్నాడు. ఇలా వీరి కుట్ర కారణంగా 52 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు.