ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించిన రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభంలో అడుగులు నెమ్మది నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణ విషయంగా మారింది. టీ కొట్టు, పాన్ డబ్బా దగ్గర నుంచి కూరగాయలు, ఇతర షాప్లలో కూడా యూపీఐ పేమెంట్స్ కొనసాగుతున్నాయి. ఇక విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ విధమైన ఒప్పందంతో భారత్-సింగపూర్ దేశాల మధ్య చెల్లింపులు సులభతరం కానుంది.