గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామ శివారులో పంట కాలువలో శనివారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వలస కూలీలు మృతి. మృతుల పేర్లు బానావత్ బాలు (45) ఆంగోతు బొగ్గు (40). వీరు గత కొంత కాలంగా నల్గొండ జిల్లా నుండి వలస వచ్చి కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు దండమూడి మల్లేశ్వరరావు తన పొలంలో ఎరువులు జల్లేందుకు తన ట్రాక్టర్ పై కూలీలను వెంటపెట్టుకొని వెళ్లుచుండగా కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు డొంక గుంతలమయం కావడంతో ప్రమాదం సంబవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రాక్లైనర్ ద్వారా ట్రాక్టర్ తొలగించి మృత దేహాలను వెలికి తీశారు. ఘటన స్థలంలో కుటుంబసభ్యుల రోదనలు స్థానికులను కలచివేసింది. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యాశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ వేంకటాద్రి.