కేరళ: కేంద్రమంత్రి అరుణ్జైట్లీ పర్యటనలో భాగంగా కేరళకు చేరుకున్నారు. తిరువనంతపురంలో గతవారం హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుటుంబసభ్యులను అరుణ్జైట్లీ పరామర్శించారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా రాజేశ్ నివాసానికి వెళ్లిన జైట్లీ..అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. రాజేశ్ కుటుంబసభ్యులకు తాము అండగా ఉంటామని జైట్లీ అన్నారు.