అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 కేటగిరీలోని 982 పోస్టులకు ఈ నెల 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష పర్యవేక్షణ కోసం ఏపీపీఎస్సీ నుంచి అధికారులను డిప్యుటేషన్పై నియమించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా అధికారుల పేర్లు, మొబైల్ నెంబర్లను ప్రకటించారు.