అమరావతి: ఆర్టీసీలో ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) కౌంటర్లను యాజమాన్యం ‘అభీబస్’ అనే ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టింది. ఆ సంస్థతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 32 ప్రధాన బస్టాండ్లలో రిజర్వేషన్ కౌంటర్లను నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే అభీబస్ కంపెనీ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. రిజర్వేషన్ కౌంటర్లను అభీబస్కు అప్పగించి బస్టాండ్లలో స్థలంతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉచితంగా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.