అనంతపురం : నాసిరకం బీటీ పత్తి, మిరప విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. పత్రికల్లో కథనాలు వచ్చాయి. వచ్చే ఖరీఫ్లో నాసిరకం విత్తనాలు అంటగట్టినా.. లైసెన్సు లేకుండా విత్తనాలను అమ్మినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ సంయుక్త సంచాలకులు శ్రీరామ్మూర్తి హెచ్చరించారు. వచ్చే ఖరీఫ్లో పత్తి, మిరప విత్తనాల ఉత్పత్తి, విక్రయ ప్రణాళికపై డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ రెండేళ్ల కిందట గులాబీరంగు పురుగు ఆశించి పత్తి పంట పూర్తిగా పోయింది. అదే తరహాలో నాసిరకం విత్తనాలతో మిరప పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత మూడేళ్లుగా పత్తి, మిరప వంటి విత్తనాలు ఎన్ని అమ్మారు, ఎంత సాగవుతోంది. విత్తనాలు, సాగు వివరాలను అందజేయాలన్నారు. ఖరీఫ్లో కంపెనీల వారీగా ఏయే విత్తనాలు ఎంతెంత ఉత్పత్తి చేశారు. ఎంత పంపిణీ చేశారన్న వివరాలను వారానికొక నివేదికలను అందజేయాలన్నారు. బీటీ పత్తి విత్తనాలకు సంబంధించి రైతులు తీసుకోవాల్సి జాగ్రత్తలను కరపత్రాలు ముద్రించి, విత్తనాలతో పాటు రైతులకు అందజేయాలన్నారు. తెగుళ్లపై ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఏడీఏలు రంగస్వామి, పద్మలత, సాంకేతిక అధికారి వెంకటేశ్వరప్రసాద్ విత్తన చట్టాలపై వివరించారు. ఈ సమావేశంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్కుమార్రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.