ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కాలంటే వరుణుడిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 10:13 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. కోహ్లీసేన విజయాన్ని అడ్డుకునే అవకాశం ఒక్క వరుణుడికి మాత్రమే ఉంది. మూడోరోజు ఆతిథ్య లంక జట్టును 291 పరుగులకే కట్టడి చేసి.. భారత్‌ 309 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించి శుక్రవారం ఆట ముగిసేసమయానికి 189/3తో నిలిచింది. ముకుంద్‌(81) ఆట చివరి ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మంచి జోరుమీదున్నాడు. శనివారం నాలుగో రోజు ఆటలో కోహ్లికి సహకారం అందించేందుకు రహానె బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని భారత్‌ 500కు పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. వీలైనంత వేగంగా పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇక భారత్‌ బౌలర్ల ముందు తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన శ్రీలంక ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో భారీ టార్గెట్‌ను ఛేదించడం దాదాపు అసాధ్యమే. శుక్రవారం గంటకుపైగా ఆటకు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కాలంటే వరుణుడిని ప్రార్థించక తప్పదు. ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లు ఆడిన భారత్‌ 196 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com