అమరావతి: మేడే సందర్భంగా వాడవాడలా అరుణ పతాకావిష్కరణలు గావించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లచట్టాలను నిరసిస్తూ గత 4 నెలలుగా రైతులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా మోదీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. కరోనా ఉధృతి రీత్యా ర్యాలీలు, బహిరంగసభలు జరపొద్దని చెప్పారు. మేడే రోజున పార్టీ శ్రేణులు శ్రమదానం చేయాలని, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని రామకృష్ణ తెలిపారు.