ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. వారు ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకున్నారు. మొదట నర్సు డాక్టర్ చెంపపై బలంగా కొట్టింది. దీంతో డాక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం పోలీసుల ముందే జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయి అలా ప్రవర్తించామని చెప్పారని రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ మిశ్రా తెలిపారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.