ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు, జవాన్ల మధ్య ఘర్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 01:36 PM

శ్రీనగర్‌: సరిహద్దుల్లో కలిసి పనిచేయాల్సిన పోలీసులు, జవాన్లే ఘర్షణకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జమ్ముకశ్మీర్‌లోని గందేర్బల్‌ జిల్లాలో ఓ చెక్‌పాయింట్‌ విషయమై ఆర్మీ సిబ్బంది, పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ఘర్షణగా మారి.. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనకు కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జమ్ముకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దులో పాక్‌ కాల్పుల ఉల్లంఘన పెరిగిపోతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com