ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కానీ మహారాష్ట్ర, కేరళలో మాత్రం ఇంకా భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై మహానగరాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో బీఎంసీ పరిధిలో 1500కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసులతో అధికారులు మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. కరోనా కట్టడికి వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో BMC అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునే అవకాశముందని తెలిపారు. పరోక్షంగా లాక్డౌన్ సంకేతాలు ఇచ్చారు.