ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన డెడ్ లైన్స్ సమీపిస్తున్నాయి. మరి ఆ డెడ్ లైన్స్ ఏంటో చూద్దాం.
- డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ డివిడెండ్ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 2021 మార్చి 15 లోగా చేయాలి.
- పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.
- ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ లో ఈ స్కీమ్ ప్రకటించింది.
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి.
- 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.
- వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి.
- కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది.
- ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు.