ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చిలో గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 11, 2021, 01:53 PM

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన డెడ్‌ లైన్స్ సమీపిస్తున్నాయి. మరి ఆ డెడ్‌ లైన్స్ ఏంటో చూద్దాం.


- డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ డివిడెండ్ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 2021 మార్చి 15 లోగా చేయాలి.
- పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.


- ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌ లో ఈ స్కీమ్ ప్రకటించింది.
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి.
- 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.
- వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌ కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి.
- కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది.
- ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌ లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com