భారత్, పాక్కు చెందిన క్రీడాకారులు లండన్లో సందడి చేస్తున్నారు. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్తో కలిసి లండన్లో చక్కెర్లు కొడుతోంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్లో పాల్గొన్న సానియా ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కాస్త విరామం దొరకడంతో మాలిక్.. సానియాతో గడిపేందుకు లండన్ వెళ్లాడు. తాజాగా సానియా జోడీ లండన్లో ఓ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. పెళ్లి ఎవరిదో తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సానియా సోషల్మీడియాలో ఉంచింది.
జహీర్ ఖాన్- సాగరిక, ఆశిష్ నెహ్రా, అజహార్ మహమూద్ కూడా ప్రస్తుతం లండన్లోనే ఉన్నారు. లండన్లో పర్యటనలో ఉన్న క్రీడాకారులంతా కలిసి దిగిన ఫొటోని సోషల్మీడియాలో చలాకీగా ఉండే సానియా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అలాగే సానియాతో కలిసి దిగిన ఓ ఫొటోను మాలిక్ తన ఇన్స్టాగ్రాంలో ఉంచాడు. వీరిద్దరికీ 2010లో వివాహమైన సంగతి తెలిసిందే. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో డబుల్స్ విభాగంలో సానియా ఏడో స్థానంలో కొనసాగుతోంది.