కోయంబత్తూర్ : తమిళనాడులో నాటుబాంబు పేలుడు కలకలం సఅష్టించింది. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు కోయంబత్తూర్ జిల్లాలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెరినాయికెన్పాలయం సమీపంలోని జ్యోతిపురం గ్రామం నందిని కాలనీలోని ఒక ఇంట్లో నాటుబాంబులు తయారు చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. అదే కాలనీకి చెందిన మణిమళన్, కే రాజు, రామరాసు, పుంతిరారులు గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. అడవి పందులను వేటాడేందుకే వీరు బాంబులను తయారు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.