దేశంలో కరోనా తగ్గముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. 24గంటల్లో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయయి. గతేడాది జూన్ తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవడం ఇదే తొలిసారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,79,179కు పెరిగింది. తాజాగా 18,358 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,01,11,294 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది. కొత్తగా మరో 167 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,51,327కు పెరిగాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,04,79,179 ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. 24గంటల్లో 8,97,056 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 18,26,52,887 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.