ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది. దీంతో ఏపీలో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేవని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.