ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పోర్టబులిటీ విధానం ను ఇకపై అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ,తెలంగాణాలను ఒక క్లస్టర్ గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని తిఆకువచ్చింది. ఈ విధానంతో ఏపీ నుండి తెలంగాణ కు వలస వెళ్లిన కూలీలు అక్కడే రేషన్ సరుకులను తీసుకోవచ్చు. ఈ నిర్ణయం సరిగ్గా అమలైతే దేశవ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్నా అక్కడే సరుకులు తీసుకులు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన 349 మంది తెలంగాణలో రేషన్ సరుకులను తీసుకున్నారు. ఏపీలో 12వ విడత సరుకుల పంపిణీ ప్రారంభంమైంది ఆదివారం 1.34 లక్షల మంది బియ్యంతో పాటూ ఇతర సరుకులను తీసుకున్నారు. ఈ విడతలో ఒక్కక్కరికీ 5కిలోల బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శెనగలు అందజేశారు.