ఏపీ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 8218 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,17,776 కి చేరింది. ఇందులో 81,763 కేసులు యాక్టివ్ గా ఉండగా 5,30,711 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 58 మంది మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5302 కి చేరింది.తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 477, చిత్తూరులో 736, తూర్పు గోదావరి జిల్లాలో 1395, గుంటూరులో 471, కడపలో 520, కృష్ణా జిల్లాలో 468, కర్నూలులో 319, నెల్లూరులో 693, ప్రకాశం జిల్లాలో 670, శ్రీకాకుళం జిల్లాలో 485, విశాఖపట్నం జిల్లాలో 451, విజయనగరంలో 462, పశ్చిమ గోదావరి జిల్లాలో 1071 కేసులు నమోదయ్యాయి.