దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట వెలువరించిన బులిటెన్ మేరకు . గత 24 గంటల్లో దేశంలో 93,337 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరింది.అలాగే గత 14 గంటలలో కరోనా కారణంగా 1247 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 85వేల 619కి పెరిగింది.