ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదిరిపోయే ప్లాన్లతో జియో ఫైబర్: 30 రోజులు ఫ్రీ ట్రయల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 08:13 PM

నూతన వినియోగదారులకు జియోఫైబర్‌ 30రోజుల ఉచిత ట్రయల్‌ను ప్రకటించింది. జియో ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లో భాగంగా రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ లతో ముందుకొచ్చింది. మిడ్ రేంజ్ ప్లాన్ లను ఎంచుకునే వినియోగదారులకు అందించే ఉచిత యాప్ లతోపాటు ఎంటర్ టైన్మెంట్ యాప్, నెట్ ఫ్లిక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా ప్లాన్ లు సెప్టెంబర్‌ 1 నుంచి యూజర్ల కోసం టారిఫ్‌ ప్లాన్లను పునరుద్ధరించింది.'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో కొత్త టారిఫ్ ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.399, రూ.699, రూ.999, రూ.1499 ప్లాన్లు ఉన్నాయి. కొత్త వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీంహాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్ వంటి 12 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. 30 రోజుల ఉచిత ట్రయల్‌లో భాగంగా 12 ఓటీటీ యాప్‌ల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.


ఇతర ఆఫర్లు


వాయిస్ కాలింగ్ కూడా ఉచితం.


కొత్త జియోఫైబర్ ప్రణాళికలు:


అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్


సిమెట్రిక్ స్పీడ్ (అప్‌లోడ్ స్పీడ్‌ = డౌన్‌లోడ్ స్పీడ్‌)


నెలకు రూ. 399 నుంచి ప్లాన్లు ప్రారంభం


అదనపు ఖర్చు లేకుండా టాప్ 12 ఓటీటీ యాప్స్ ఉచితం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com