ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికీ వెంటిలేటర్‌పైనే ప్రణబ్ ముఖర్జీ...

national |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 12:35 PM

న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న మాజీ రాష్ట్రపతి ప్రబణ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి తాజా బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో చికిత్స అందిస్తున్నామని చెప్పింది.


ఆయన గుండెతో పాటు కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగానే ఉందని  ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. కాగా, ప్రణబ్‌ ముఖర్జీకి కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఇటీవల సర్జరీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com