రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా ఉన్న సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని, ఈఎస్ఐని అమలు చేయాలని , కరోనా బీమా సౌకర్యం 50 లక్షలు కల్పించాలని , గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షుడు లక్ష్మణ్, కోశాధికారి వెంకట లింగం సివిల్ సప్లై అమాలి యూనియన్ కార్యదర్శి గోపాల్, లతో పాటు మరో 30 మందికి హమాలీలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ హమాలీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, రెడ్ జోన్ లలో సైతం ప్రాణాలను లెక్కచేయకుండా ప్రభుత్వం ఇచ్చే ఉచిత సరుకులను ఎగుమతి దిగుమతి చేస్తూ ఉన్నారని అటువంటి హమాలీల పై రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి 1 నుండి కూలిరేట్లు పెంచి చెల్లించాల్సివుండగా నేటికీ రేట్లు పెంచకుండా తాత్సారం చేయడాన్ని నిరసిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిరేట్లు పెంచి ఎరియర్స తో సహా చెల్లించాలని తెలియజేయడం జరిగింది.