కలిగియుగ దైవం వేంకటేశ్వరుడి నక్షత్రం శ్రావణం. కాబట్టి ఈ శ్రవాణమాసంలో వచ్చే శనివారాలలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయని భక్తుల నమ్మకం. దీంతో పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం, పూజ, ఉపవాసం తదితర ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పును పూజించడం సర్వశుభాలను అందిస్తుంది. ఈ మాసంలో కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతమైదని వారు సూచిస్తున్నారు. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర ఆరాధన వల్ల శనిబాధలు, ఈతి బాధలు పోతాయి. స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నేరవేరుతాయని పండితులు చెబుతున్నారు.