ఏపీ సీఎం జగన్ గురువారం ఉన్నత విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 15న కాలేజీలు తెరవాలని నిర్ణయించారు. అదే విధంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల భర్తీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గ్రాన్ ఎన్ రోల్ మెంట్ను 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటీస్, మరో ఏడాది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఉపాది కల్పించే కోర్సులను ఈ ఏడాది నుంచి విద్యార్దులకు నేర్పనున్నారు. అదే విధంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సెట్లను సెప్టెంబర్ లో నిర్వహించనున్నారు.