భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో భారత్ లో 52,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షల 3 వేల 696కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 11 లక్షల 86 వేల 203 మంది మరణించగా 38,135 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షల 79 వేల 357 కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో 771 మంది మరణించారు.