న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు శనివారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ.. మొదట పోర్చుగల్, ఆ తర్వాత అమెరికా, చివరగా నెదర్లాండ్స్లో పర్యటించనున్నారు. అమెరికాలో మోదీ రెండు రోజులు పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మంత్రులు, వివిధ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. వాషింగ్టన్లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నారు.