ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారింది... కొమ్మారెడ్డి పట్టాభిరామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 11, 2020, 03:00 PM

ప్రజల పక్షాన టీడీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం బీసీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారిందని కొల్లు రవీంద్ర కేసే చెబుతోందని ఆయన మండిపడ్డారు. హతుడు భాస్కర్ రావుపై దాదాపు 90 కేసులున్నాయని.. అటువంటి వ్యక్తి హత్యకు గురైతే, వైసీపీ ప్రభుత్వం అతడిని పోరాటయోధుడిగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తప్పుడు ఆధారాలతో మాజీ మంత్రి రవీంద్రను కేసులో ఎలా ఇరికించారో పోలీసులు, ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జూన్ 29 రాత్రి నిందితులు లొంగిపోతే.. జులై 2న వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు రికార్డుల్లో చూపడమేంటని ప్రశ్నించారు. ధర్మం అంతా తాడేపల్లి ప్యాలెస్​కు, డీజీపీ కార్యాలయానికి మధ్యనే నడుస్తోందనడానికి ఈ ఆధారాలు చాలన్నారు. భాస్కరరావుపై కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన రవీంద్రకు ఉంటే, మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు వదిలేసేవారని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com