నేటి నుంచి దేశ వ్యాప్తంగా దేశీయ విమానాలు ప్రారంభమవుతున్నాయి. ఏపీలో మాత్రం మంగళవారం నుంచి విమానాలు ఎగరనున్నాయి. ఏపీ సర్కార్ విమానం ఎక్కాలంలే కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. అవి ఇలా ఉన్నాయి.
ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా స్పందన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
స్పందనలో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ టికెట్లను బుక్ చేసుకోవాలి.
స్పందన ద్వారా అనుమతి లభించనదే టికెట్లు కొనుగోలుకు అనుమంతిచొద్దని విమానయాన సంస్థలకు ఏపీ ప్రభుత్వం సూచన.
రాష్ట్రంలోకి వచ్చిన వారందరికి స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరి.
కరోనా లక్షణాలు లేనివారిని ప్రభుత్వం రెండు విభాగాలుగా విభజన.
కరోనా ఎక్కువగా ఉన్న చెన్నై, ముంబై, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే వారిని నేరుగా క్వారంటైన్కు తరలింపు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేసిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండేలా ఆదేశాలు.
వీటన్నింటికి ఒప్పుకుంటేనే రాకపోకలు ఉంటాయని,లేకపోతే అనుమతులు ఉండవని ప్రభుత్వం తెలిపింది.