ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13 ఏళ్ళ బాలిక లిఖిత కిడ్నాపర్ నుండి క్షేమంగా ఇంటికి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2017, 10:36 PM

గుంటూరు: గుంటూరు జిల్లా భట్టిప్రోలులో అపహరణకు గురైన 13 ఏళ్ళ బాలిక లికితను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సమక్షంలో గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.


ఏప్రిల్ 20న, లిఖితను ఆటోడ్రైవర్ నాగేశ్వర్ రావు మాయమాటలు చెప్పి అపహరించుకుపోయాడు. పాఠశాలకు వెళ్ళిన తమ కుమార్తె ఏమైందో తెలియక తల్లిదండ్రులు అపహరించిన నాగేశ్వర్ రావు ఢిల్లీ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కు తీసుకెళ్ళాడు.


గతంలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేసిన నాగేశ్వర్ రావుకు ఆ ప్రాంతాలపై పట్టుంది. దీంతో ఇంతకాలంపాటు ాయన సులువుగా తప్పించుకొన్నాడు. పోలీసులు ఎంతకాలంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.


తల్లిదండ్రులు మహిళా కమిషన్ కు...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళారు. గాలింపును ముమ్మరం చేయాలంటూ అధికారుల్ని ఆదేశించారు.


ప్రత్యేక పోలీసు బృందాలు లిఖితను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చాయి. మరో వైపు ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపి విడుదల చేసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com