ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్ పై వెళ్తుండగా హఠాత్తుగా పేలిన ఫోన్.. యువకునికి తీవ్రగాయాలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 12:51 PM

కర్ణాటక, మైసూరులోని నంజనగూడు తాలూకా హుల్లహళ్లి గ్రామంలో మొబైల్‌ హఠాత్తుగా పేలిపోవడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డడు. కురిహుండి గ్రామానికి చెందిన బవసరాజు బైకుపై కురిహుండి గ్రామం నుంచి హుల్లహళ్లి గ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో ఫోన్‌ రావడంతో కాసేపు మాట్లాడిన అనంతరం మొబైల్‌ను జేబులో పెట్టుకొని ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లగానే మొబైల్‌ఫోన్‌ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోవడంతో బైకు అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఘటనలో బసవరాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.హుల్లహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com