ఏపీ వ్యాప్తంగా ఏసీబీ చీఫ్ సీతారామంజనేయులు నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. తహశీల్థార్ కార్యాలయాలే టార్గెట్ గా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఏసీబీ అధికారులను చూసి రెవెన్యూ ఉద్యోగులు పారిపోయారు. పట్టాదారు పాసు పుస్తకాలకు వేలాది రూపాయాలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. స్పందన కార్యక్రమంలో ఒక్కో పట్టాదారు పాసు పుస్తకానికి 25 వేలు వసూలు చేస్తున్నారని రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
వీఆర్వోలను సైతం పిలిచి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అన్ని చోట్ల తలుపులు మూసివేసి అధికారులను ఎంక్వైరీ చేస్తున్నారు. 15 రోజుల క్రితం సబ్ రిజిస్టార్ ఆఫీసులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలిసిందే.