ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. ఇదే కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మీ, వీడీ రాజగోపాల్ హాజరయ్యారు. ఈడీ హాజరు మినహాయింపు పిటిషన్ పై కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. జగన్ హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తరపు లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు.