జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని సోషల్ మీడియాలో పలు రూమర్లు హల్చల్ చేశాయి. ఈ విషయంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేసారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, రాపాక అంశంపై నెట్టింట్లో వచ్చేనవన్నీ వట్టి రూమర్లేనని వెల్లడించింది.
ఏపి అసెంబ్లీ సమావేశాలలో సర్కారీ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలన్నముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ రాపాకమాట్లాడారు. ఓ వైపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం ఉన్న పాఠశాలలు తెలుగు మీడియాన్ని కొనసాగించాలని కోరుతున్న విఫయాన్ని చెప్పడంతో పాటు జగన్పై ప్రశంసలు కురిపించడమే జనసేనకు మింగుడు పడటంలేదు. దీంతో ఆతనికికి నోటీసులిచ్చినట్టు గత రెండ్రోజులుగా వినిపిస్తోంది. అయితే తాజా ప్రకటనతో రాపాక వరప్రసాద్పై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేనట్లే నని స్పష్టమవుతోంది.