సముద్రాల్లో జల కన్యలు ఉంటాయని చాలా మంది అంటుంటారు. ఇంకా కొంత మంది మేము చాలా సార్లు చూశామని కూడా చెబుతుంటారు. కొందరేమో వెంకటేష్ సినిమాలో జల కన్యలు భూమీద ఉన్నాయని అంటున్నారు. కానీ, వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అవి కేవలం పుకార్లే అని చాలా లైట్ తీసుకున్నారు.
ఇప్పుడు మనిషి ముఖాలతో చేపలున్నాయట. అవి అందరికి కనిపిస్తున్నాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. దక్షణ చైనాలో మిమి అనే గ్రామంలోని చెరువులో ఈ చేపలు సంచరిస్తున్నాయట. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న ఓ మహిళా వీడియో తీసి మరి చైనాకు సంబందించిన 'వీబో' అనే వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియో ను చూసిన వారంతా ఆశ్చార్యానికి గురవ్వడమే కాదు ఈ చేపను తినే సాహసాం ఎవరికైనా ఉందా అంటూ ఒకరికొకరు సవాల్ విసురుతూ కామెంట్లు చేస్తున్నారు.