ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారి

national |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2019, 11:09 AM

కారు డిక్కిలో రూ.1.30 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో చోటుచేసుకుంది. హర్యానాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారి. నిందితుడిని ఢిల్లీకి చెందిన దివేశ్‌గా గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎంజీ రోడ్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా నగదు పట్టుబడింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదును తరలిస్తున్నట్లుగా సమాచారమని పోలీసులు వెల్లడించారు. నగదును సీజ్‌ చేసిన పోలీసులు వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com