విశాఖ జిల్లా కేబీపీ అగ్రహారం రేషన్ డిపోలో బుధవారం విచారణ జరిపారు. ఈ విచారణలో డీలర్ పై 6ఎ కేసు నమోదు చేసినట్లు తహసిల్దార్ కనకారావు చెప్పారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మండలంలోని పలు ప్రాంతాలలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నాయన్నారు. పదిమంది మృతుల పేరిట నిత్యావసర సరుకులను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా, ప్రభుత్వానికి అప్పగించకుండా నాలుగేళ్లుగా స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన పలువురు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఇక్కడ రెవిన్యూ కార్యాలయానికి ఆదేశాలు రావడంతో.. బుధవారం తాసిల్దార్ కనకారావు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు.